తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చిందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.