ఆ డైరెక్టర్ పవన్ పై సెటైర్లు వేసాడు..అందుకే మహేష్ సినిమా వదిలేసా అంటూ రేణు దేశాయ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అందుకే రాజకీయాల ప్రభావం ఆయన సినిమాల మీద పడుతూ ఉంటుంది.

 Renu Desai Comments That The Director Satirized Pawan That's Why Mahesh Left The-TeluguStop.com

ఆయన గత మూడు చిత్రాలపై ప్రభుత్వం ఏ రేంజ్ లో కుట్రలు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ ( Bheemla Naik )సినిమాలపై టికెట్ రేట్స్ ప్రభావం చాలా బలంగా పడింది.

ఈ రెండు సినిమాలు వంద కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వచ్చి ఆగిపోవడానికి కారణం టికెట్ రేట్స్.అయితే దీనిపై సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలేదు.

పైగా కొంతమంది డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్స్ వేస్తూ సన్నివేశాలను రాస్తున్నారు.అలాంటి డైరెక్టర్స్ జాబితా లో పరశురామ్ పెట్ల కూడా ఉన్నాడు.

ఈయన గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Telugu Bhimla Naik, Mahesh, Pawan Kalyan, Renu Desai-Movie

ఆమె మాట్లాడుతూ ‘నాకు మహేష్ బాబు గారి సర్కారు వారి పాట ( Sarkaru vari pata )సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ గా నటించే ఛాన్స్ దక్కింది.చాలా మంచి పాత్ర, ఆ క్యారక్టర్ ని తర్వాత నదియా గారు చేసారు.నేను నటించడానికి సిద్దమే కానీ, నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ మీద కొన్ని పరోక్షమైన డైలాగ్స్ పెట్టించారు.

అది నాతోనే చెప్పించాలని చూసారు, అందుకే నేను ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పరశురామ్ పెట్ల వైసీపీ పార్టీ కి మద్దతుదారుడు.

ఆయన అన్నయ్య గణేష్ పెట్ల కూడా వైసీపీ పార్టీ( YCP ) లో పని చేస్తున్నాడు.అందుకే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమాలో ఎదో ఒక డైలాగ్ కానీ, సన్నివేశం కానీ పెట్టాలని చూసాడు.

Telugu Bhimla Naik, Mahesh, Pawan Kalyan, Renu Desai-Movie

ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో తనికెళ్ళ భరణి( Tanikela Bharani ) ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్స్ గా ప్రభాస్ శ్రీను మరియు ఆయన గ్యాంగ్ వస్తారు.దౌర్జన్యం చెయ్యడానికి చూస్తే మహేష్ బాబు వాళ్ళతో ఫైట్ చేసి చివర్లో గాజు గ్లాస్ తీసి ప్రభాస్ నోట్లో పెట్టి లోపలకు పంపుతాడు.ఇక్కడ గాజు గ్లాస్ సన్నివేశాన్ని అవసరం లేకపోయినా కావాలని పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా విమర్శించడానికే అని అంటున్నారు ఫ్యాన్స్.రేణు దేశాయ్ కామెంట్స్ చేసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా లో పరశురామ్ పెట్ల ని ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube