మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో భాగంగా నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.కాగా విచారణలో భాగంగా తన అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో న్యాయస్థానం రేపు విచారిస్తామని వెల్లడించింది.
మరోవైపు ఇదే కేసులో నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
ఈ క్రమంలో పునీత్ ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది.