మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ వాయిదా

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో భాగంగా నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Inquiry On Cid Notices To Ex-minister Narayana Adjourned-TeluguStop.com

ఈ క్రమంలో నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.కాగా విచారణలో భాగంగా తన అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో న్యాయస్థానం రేపు విచారిస్తామని వెల్లడించింది.

మరోవైపు ఇదే కేసులో నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

ఈ క్రమంలో పునీత్ ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube