సీపీఎం నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని చెప్పారు.
అయితే తొందర పడాల్సిన అవసరం లేదని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.ఈ మేరకు నిర్దిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.
లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామని తెలిపారు.అయితే బీఆర్ఎస్ పార్టీ పొత్తు ధర్మం పాటించలేదని తమ్మినేని విమర్శించారు.
బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుందని వెల్లడించారు.తెలంగాణలో బీజేపీ మరింత పడిపోతోందని తెలిపారు.
ధరల పెరుగుదలపై సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు నిరసనలు చేస్తామని వెల్లడించారు.