రాజన్న సిరిసిల్ల జిల్లా :77 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayant ) డిపిఆర్ఓ మామిండ్ల దశరథం( DPRO Mamindla Dasaratham ) ను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుకు ఎంపిక చేశారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( IT Minister KTR )రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ మామిండ్ల దశరథం బెస్ట్ ఎంప్లాయ్ వార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ, వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.