మైనర్లను కట్టేసి మూత్రం తాగించి, మిరపకాయలతో చిత్రహింసలు..!

దొంగతనం చేశారేమో అనే అనుమానంతో ఇద్దరు మైనర్ పిల్లలను కట్టేసి, మూత్రం తాగించడంతోపాటు ఆ పిల్లల ప్రైవేట్ పార్ట్శ్ లో మిరపకాయలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) సిద్ధార్థ నగర్ జిల్లాలోని దమారియా గంజ్ తహసీల్ ఏరియాలోని కొంకటి ప్రాంతంలో చోటుచేసుకుంది.బాధిత మైనర్ పిల్లాడి తండ్రి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఎనిమిది మంది నిందితులలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ సిద్దార్థ్ తెలిపారు.

 Boys Forced To Drink Urine Over Theft Suspicion In Uttar Pradesh Details, Minor-TeluguStop.com

వివరాల్లోకెళితే.

పత్ర బజారులోని కొంకటి కూడలిలో ఉండే చికెన్ షాప్( Chicken Shop ) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.కోళ్ల ఫారం లో రూ.2000 దొంగలించారనే అనుమానంతో ఇద్దరు మైనర్ బాలురు చేతులు కట్టేశారు.ఆ తర్వాత ఆ బాలురు ప్రైవేట్ పార్ట్స్ లో పచ్చిమిర్చి చూపించి చిత్రహింసలకు గురి చేశారు.అంతటితో ఆగకుండా ఆ పిల్లలతో మూత్రం( Urine ) తాగించారు.

ఆ పిల్లలు సహాయం కోసం ఎంతలా అరుస్తూ ఉన్నా ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

అయితే ఆ ఇద్దరి పిల్లలలో ఒక పిల్లవాడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ లోని కొన్ని సెక్షన్ల కింద 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.అందులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఆదివారం దుమారియా గంజ్ కు చెందిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్( MP Jagadambika Pal ) బాలురు చికిత్స పొందుతున్న జిల్లా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అభం శుభం తెలియని చిన్నారులపై జరిగిన ఈ దారుణంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube