మంత్రి పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన యస్ఆర్ & బీజీఎన్ఆర్ కళాశాల విద్యార్థులు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Ajay Kumar Puvvada ) కృషితో యస్ఆర్ & బీజీఎన్ఆర్కళాశాల న్యాక్ ఏ2 గ్రేడ్ సాధించిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షుడు అల్ సాద్ విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా షేక్ బాజీ బాబా మాట్లాడుతూ SR&BGNR కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపురావడం ఇదే కళాశాలలో చదువుకొని కళాశాల అభివృద్ధి కోసం మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు నిధులు కేటాయించి కళాశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

 Students Of Sr Bgnr College Who Performed Palabhishekam For Minister Puvwadas P-TeluguStop.com

కళాశాల కోసం అదనపు గదులు కంప్యూటర్ ల్యాబ్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మౌలిక సదుపాయాలతో పాటు కళాశాలలో సుడా నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది.అదేవిధంగా కళాశాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి కళాశాల సిబ్బంది మరియు ప్రిన్సిపాల్ తో నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు.

ఎంతో మంది మేధావులు అందించిన SR&BGNR కళాశాల ఎంతోమంది మేధావులు అందించేందుకు సిద్ధంగా ఉందని దీనిలో భాగంగానే అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని దానిలో భాగంగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముందు ఉంటారని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ( Khammam )నియోజకవర్గం విద్యార్థి సంఘ నేతలు రియాజ్ ,షోయల్ ,సందీప్, కార్తీక్,ఉపేందర్ ,మధు ,సందీప్ మరియు కళాశాల విద్యార్థులు సంధ్యారాణి మహేశ్వరి రమ కళ్యాణి నాగమణి రాజ్యలక్ష్మి రూప భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube