చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
అందుకే పసి పిల్లలను తల్లిదండ్రులు ఏ మాత్రం విడిచి పెట్టరు.అయితే నడక వచ్చిన తర్వాత కూడా పిల్లలు( children ) ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించడం అవసరం.
పెద్దవుతున్న కొద్దీ కొన్ని తుంటరి పనులను పిల్లలు చేస్తుంటారు.ఏది మంచో ఏది చెడో తెలియని స్థితి వారిది.
అందుకే పిల్లలకు ఎప్పటికప్పుడు పెద్దలు జాగ్రత్తలు చెబుతుండాలి.ఒక్కోసారి విననట్లు పిల్లలు ప్రవర్తిస్తుంటారు.
అయినప్పటికీ ఓపికతో మంచీచెడూ వారికి చెప్తేనే వారు ప్రమాదాలకు గురవకుండా ఉంటారు.
చైనాలోని హుబే ప్రావిన్స్లో 27 అంతస్తుల భవనం పైకప్పుపై ఇద్దరు అబ్బాయిలు ప్రమాదకర రీతిలో ఆడారు.అందులో ఒక బాలుడు రెండు భవనాల మధ్య చాలాసార్లు అటూ ఇటూ దూకడం వీడియోలో కనిపించింది.చైనా మీడియా సంస్థల ప్రకారం 2021 అక్టోబర్ 26న ఈ ఘటన జరిగింది.
అయితే ఈ పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక వీడియో విషయానికొస్తే జియానింగ్ సిటీలోని భవనాలపై ఇద్దరు బాలురు ఆడుకుంటూ కనిపించారు.
ఓ బాలుడు బాగా తుంటరితనంలో ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కు జంపింగ్ చేశాడు.క్రింది నుంచి వీరిని చూసిన ప్రజలు హడలి పోయారు.
వారు ఏ మాత్రం కిందకు జారిపడితే వెంటనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.దీనిని కొందరు వీడియో తీశారు.
దానిని భవనానికి సంబంధించిన ప్రాపర్టీ మేనేజర్కు( Property Manager ) సమాచారం అందించారు.దీంతో వారు ఆ అబ్బాయిలను సురక్షితంగా తీసుకెళ్లారు.
బిల్డింగ్ మేనేజర్ దీనిపై స్పందించారు.పైకప్పుకు ఉన్న తలుపుల తాళాలు పగులగొట్టి ఉన్నాయని, దీంతో ఆ పిల్లలు అక్కడకు వెళ్లి ప్రమాదకర స్థాయిలో ఇలా జంపింగ్లు చేశారని వివరించాడు.
ప్రస్తుతం వాటిని మార్చినట్లు తెలిపారు.