వైరల్: చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది... క్రేన్ ఒక్కసారిగా పడడంతో మృత్యువాత!

చావు అనేది తెలియకుండా వస్తే పడే బాధ ఒకలా ఉంటుంది, అదే తెలిసే వస్తే మరో విధంగా ఉంటుంది.తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది.

 Viral: The Worst Happened While Watching The Crane Fell Down And Died ,crane Acc-TeluguStop.com

తమిళనాడులోని అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్‌ ఒక్కసారిగా బోల్తా పడడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.చికిత్స పొందుతూ ఒకరు చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ ఘటనలో మరో 9 మందికి గాయాలపాలయ్యారు.

వివరాల్లోకి వెళితే, ఈ ఆదివారం రాత్రి 8.15 గంటలకు చెన్నై సమీపంలోని నెమిలిలోని కిల్వీధి గ్రామంలో ‘ద్రౌపతి అమ్మన్’ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలను చూసేందుకు ఆ గ్రామ ప్రజలే కాకండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చారు.

మైలేరు ఉత్సవాల్లో భాగంగా క్రేన్‌పై దేవతా విగ్రహాలను ఊరేగించారు.దాంతో భక్తులు పులకిస్తూ ఆ దృశ్యాలను చూస్తున్నారు.అలాగే పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై ఓ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉండటం ఇక్కడి వీడియోలో చూడవచ్చు.

అయితే క్రేన్‌పై అధిక బరువు ఎక్కువవడటంతో క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.దీంతో క్రేన్‌పై నున్న ముగ్గురు వ్యక్తులపై క్రేన్ పడి బలంగా తాకడం వలన అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.కాగా ఉత్సవాలను తిలకిస్తున్న చాలా మంది తమ సెల్ ఫోన్లలో సదరు దృశ్యాన్ని చిత్రీకరించారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు తీవ్ర దుఃఖాన్ని ప్రకటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube