స్టార్ హీరో రామ్ చరణ్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ అభినయం ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉంది.
ఈ సినిమా సక్సెస్ తో నార్త్ ఇండియాలో కూడా రామ్ చరణ్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ తుఫాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలీసిందే.
నేపాల్ లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.అయితే ప్రముఖ నేపాల్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో రామ్ చరణ్ ఫోటోను ప్రచురించడం గమనార్హం.
నేపాల్ పేపర్ లో చరణ్ ఫోటోను చూసి చరణ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించడం వల్లే ఆయనకు ఈ స్థాయిలో ప్రశంసలు దక్కాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మాణం విషయంలో రాజీ పడటం లేదని భారీ మొత్తం ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది.
అయితే సెంటిమెంట్ ను పక్కన పెట్టి చరణ్ మరోసారి కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.చరణ్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చరణ్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.