పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు.పవన్ పై అభిమానం చాటుకునే ఛాన్స్ వస్తే పవన్ ఫ్యాన్స్ ఆ ఛాన్స్ ను అస్సలు వదులుకోరు.
తాజాగా పవన్ అభిమాని ఒకరు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది.పవన్ ను సినిమాల విషయంలోనే కాక పవన్ వ్యక్తిత్వం నచ్చి కూడా కొంతమంది అభిమానిస్తున్నారు.
సినిమా రంగానికి చెందిన వాళ్లలో కూడా కొంతమంది పవన్ కు ఫ్యాన్స్ గా ఉన్నారు.
తాజాగా ఒక వ్యక్తి తన పెళ్లి కార్డులో పవన్ ఫోటోను ముద్రించుకోగా ఆ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని శ్రీనివాస్ పవన్ కు వీరాభిమాని కాగా ఈ నెల 18వ తేదీన శ్రీనివాస్ పెళ్లి జరగనుంది.తన లైఫ్ లో జరుగుతున్న శుభకార్యంలో పవన్ ను కూడా భాగం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి పత్రికలో దేవుళ్లకు బదులుగా శ్రీనివాస్ పవన్ ఫోటోను ముద్రించుకున్నారు.
ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ తనకు దేవుడితో సమానం అని ఆ కారణం వల్లే పవన్ ఫోటోను శుభలేఖలపై ముద్రించుకున్నానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.పెళ్లిలో ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులపై కూడా పవన్ ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని శ్రీనివాస్ తెలిపారు.అయితే శ్రీనివాస్ నిర్ణయాన్ని కొంతమంది మెచ్చుకుంటుంటే మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు పవన్ నటించిన భీమ్లా నాయక్ థియేటర్లలో మరో నెల రోజుల్లో సందడి చేయనుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదలైతే ఆ సినిమాకు కలెక్షన్లు కూడా బాగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
అయితే ఈ సినిమాకు పెద్ద సినిమాలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి పోటీ ఎదురవుతోంది.శ్రీనివాస్ చేసిన పని గురించి పవన్ ఫ్యాన్స్ అభిమానం పీక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.