న్యూస్ రౌండప్ టాప్ 20

1.కేంద్ర మంత్రి తో తెలంగాణ మంత్రి భేటీ

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

కేంద్రం వచ్చే పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పురుషోత్తం.రూపాల ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ కలిశారు. 

2.కార్వీ కేసులో ఈడీ మరింత స్పీడ్

  కార్వీ కేసులో ఈడి దూకుడు పెంచింది.కావ్య సంస్థల పైన ఈడి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.బుధవారం దాదాపు 16 చోట్ల కార్వీ సంస్థల పై ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

3.అగ్రి కోర్టులోనూ ఆధునిక టెక్నాలజీ పై శిక్షణ

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను సేంద్రియ వ్యవసాయం లో వినియోగించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు సూచించారు .అగ్రికల్చర్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆయా అంశాలలో శిక్షణ ఇవ్వాలన్నారు. 

4.సివిల్స్ అభ్యర్థులకు sc స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ

  రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు sc స్టడీ సర్కిల్ ద్వారా ముందస్తు శిక్షణ అందించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. 

5.ఫార్మసీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  మహబూబాబాద్ లోని ప్రభుత్వ గురుకుల ఫార్మసీ కళాశాలలో బోధన సిబ్బందిని నియమించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ బి ఫార్మసీ అధ్యాపకుల పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

6.ఇందిరాపార్కు లో అఖిల పక్షం మహాధర్నా

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  హైదరాబాదుని ఇందిరా పార్క్ లో అఖిల పక్షం మహాధర్నా బుధవారం ఉదయం ప్రారంభమైంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ధర్నాకు దిగింది. 

7.సాహితీ దుందుభి పుస్తకావిష్కరణ

  డిగ్రీ విద్యార్థులు రచన నైపుణ్యాలను పెంపొందించడం మే లక్ష్యంగా రూపొందించిన సాహితీ పుస్తకాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబద్రి ఆవిష్కరించారు. 

8.టాలీవుడ్ డ్రగ్స్ కేసు

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.ఈరోజు నటుడు తరుణ్ ఈడి అధికారుల ముందు హాజరయ్యారు. 

9.15 నుంచి ద్వారకతిరుమల లో కల్యాణోత్సవాలు

  ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 15 నుంచి 22 వరకు అశ్వయుజ మాస తీరు కల్యాణోత్సవాలను కువైట్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో  సుబ్బారెడ్డి తెలిపారు. 

10.లింగాయత్ లను ఓ బీసీల్లో చేర్చాలి

  వీరశైవ లింగాయత్ సామాజిక వర్గాన్ని ఓ బీసి జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సాహ్ని కి ఎంపీ బిబి పాటిల్  విజ్ఞప్తి చేశారు. 

11.సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ .కేటీఆర్ ఆనందం

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్.జివి  కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. 

12.ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. 

13.రాయలసీమ ప్రాజెక్టును ఆపాలి

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి చర్యలు తీసుకోవాలని, పులిచింతల వద్ద లేదా ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రాజెక్టులను నిర్మించుకోవాలని ఏపీకి సూచించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

14.టెలిమెడిసిన్ సేవలో ఏపీ ఫస్ట్

  కేంద్ర ప్రభుత్వం ఈ – సంజీవిని పేరుతో అందిస్తున్న టెలి మెడిసిన్ దేశ వ్యాప్తంగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. 

15.సీత కు స్వల్ప అస్వస్థత

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  ములుగు ఎమ్మెల్యే దాసరి సీతక్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

16.హైకోర్టు తీర్పు పై రఘురామ స్పందన

  టిటిడి బోర్డు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు నియామకాన్ని హైకోర్టు సస్పెండ్ చేయడం మంచి పరిణామమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

17.టీటీడీ భక్తులకు కొత్త నిబంధనలు

  తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు ఇకపై స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ 2 వాక్సిన్ లు పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. 

18.టిటిడి నిర్ణయం ను సస్పెండ్ చేసిన హైకోర్టు

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  టిటిడి పాలకమండలి సభ్యుల నియామకం పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది.ప్రత్యేక ఆహ్వానితులు కోసం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 

19.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Purushottam, Mla Rajasinghe, Gold, Top-Latest News - Telugu

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,360   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,360  

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube