తమిళ తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నారు.
కేవలం సినిమా అంటే గౌరవం మాత్రమే కాకుండా రజినీకాంత్ కి ఆధ్యాత్మిక భావం కూడా ఎక్కువ అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రజనీకాంత్ నటించిన ప్రతి సినిమా తరువాత ఆయన హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు హిమాలయాలలో గడిపి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా రజనీకాంత్ తమ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ను కలిశారు.తనతో పాటు తన ఇద్దరు కూతుర్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ తో కలిసి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ను కలిశారు.
ఈ క్రమంలోనే గురువును కలిసినటువంటి ఫోటోను సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అదేవిధంగా రజిని గురువు బేటీ ప్రస్తుతం చర్చనీయాంశంగా.
ఇకపోతే రజనీకాంత్ తాజాగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తై” చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సెట్ లో డాక్టర్లను పెట్టుకొని మరి సినిమా షూటింగ్ పూర్తి చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అలాగే ఈ సినిమా తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ సమయంలోనే రజనీకాంత్ తన తరువాత చిత్రాన్ని తన కూతురు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి వీటిలో ఏది నిజం.ఏది అబద్దం.అనే విషయాలు తెలియాలంటే రజనీ కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.