మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ను తెలుగు లో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.కేవలం 40 రోజుల వ్యవధిలోనే తెలుగు దృశ్యం 2 ను ముగించారు.
వెంకటేష్ ఇతర స్టార్స్ పారితోషికం మొత్తం కలిపి కూడా పాతిక కోట్ల లోపే అయినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా ను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు.
కాని కరోనా కారణంగా సినిమా ను థియేటర్లలో విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం అయ్యింది.దృశ్యం 2 మలయాళ వర్షన్ కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మలయాళ వర్షన్ అమెజాన్ లో విడుదల అవ్వగా తెలుగు వర్షన్ ను హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే హాట్ స్టార్ వారితో ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్ ఏకంగా 50 కోట్లకు కొనుగోలు చేసిందట.ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ కలిపి ఈ మొత్తం దక్కించుకుంది.
దృశ్యం 2 సినిమా తెలుగు వర్షన్ లో వెంకీ కి జోడీగా మీనా నటించగా మొదటి పార్ట్ లో నటించిన పిల్లలే రెండవ పార్ట్ లో కూడా కనిపించబోతున్నారు.
దృశ్యం మొదటి పార్ట్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.అప్పట్లోనే 40 నుండి 50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.అందుకే ఈ సినిమాకు అంత మొత్తంలో పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కు అయిన ఖర్చు కంటే ఏకంగా డబుల్ బిజినెస్ చేయడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.అయితే ఈ సినిమా ను నేరుగా థియేటర్లలో విడుదల చేస్తే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చి ఉండేవేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.