ఇప్పటికే సవాలక్ష సమస్యలతో ఏపీ సీఎం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకపక్క విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూనే రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కొంటూ ఉండడం, ఇంకోపక్క సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వడం, ఇలా ఎన్నో కారణాలతో జగన్ ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమయంలో కొంతమంది పార్టీలోని నాయకుల నుంచి జగన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలో జగన్ కు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎంతోమంది కీలక నాయకులు 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా గెలిచారు.తమకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని , తాము సీనియర్లమే కాకుండా, జగన్ కు అత్యంత సన్నిహితులము కాబట్టి తమకు ఏ మంత్రి పదవి దక్కుతుందని చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రి పదవులు విషయంలో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, జగన్ మాత్రం సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించి వీర విధేయులైన వారిని సైతం పక్కన పెట్టారు.అయితే రెండున్నర సంవత్సరాల తరువాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపడతాము అని అప్పుడే జగన్ ప్రకటించారు.అప్పుడు అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేయడంతో, ఇప్పటి నుంచే తమకు మంత్రి పదవులు ఇస్తున్నారా లేదా అనే విషయంపై సీనియర్ నేతలు జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకున్న వారిలో చాలా మందిని జగన్ తొలగిస్తారు అని, వారిపై అవినీతి ఆరోపణలు రావడం, మంత్రులుగా ఎంపిక చేసిన వాళ్ళల్లో ఇంకొంతమంది పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా వ్యవహరించడం లేకపోవడం వంటి కారణాలతో ఈ దఫా మంత్రి పదవులు చాలా
అందుకే ఇప్పటి నుంచి జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలకు జగన్ తో ఉన్న చనువు కారణంగా మరింత ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.
ఈ కరోనా వ్యవహారం సద్దుమణిగిన తరువాత జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ రకమైన ఒత్తిడి జగన్ ఎదుర్కుంటున్నారట.