2012వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా హీరోయిన్ గా తమిళ్ బ్యూటీ శృతి హాసన్ నటించి తన అందచందాలతో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది.
అప్పటి వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న శృతి హాసన్ కి ఈ సినిమా ఒక రకంగా లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు.అంతేకాక ఈ చిత్రం దర్శకనిర్మాతలకు కూడా కాసుల పంట పండించింది.
అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో హీరోగా నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తాను గబ్బర్ సింగ్ చిత్రం కథ విన్నప్పుడు మొదటగా దబాంగ్ చిత్రాన్ని చూశానని దాంతో ఇందులో స్పెషల్ ఏముందనే విషయంపై ఎక్కువగా ఆలోచించానని చెప్పుకొచ్చాడు.
దీనికి తోడు తాను అప్పటికే చేసినటువంటి అప్పులు, డబ్బు అవసరాలు కారణంగా కూడా గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోగా నటించాల్సి వచ్చిందని కూడా తెలిపాడు.ఈ చిత్రం మంచి హిట్ అవడంతో తనకు పేరు ప్రఖ్యాతలతో పాటు తన అప్పులు కూడా తీరాయని తెలిపాడు.
అలాగే తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పెద్ద దర్శక నిర్మాతలతో పని చేసే క్రమంలో కొంతమేర ఇబ్బంది పడ్డానని అందువల్లనే తన నటనా ప్రతిభకి కంఫర్ట్ గా ఉన్నటువంటి దర్శకులతో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వాడినని తెలిపాడు.అయితే ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్.జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన కొమరం పులి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిందని దాంతో సినిమాల రిజల్ట్స్ మన చేతుల్లో ఉండవని తెలుసుకున్నట్లు తెలిపాడు.అంతేగాక తాను హిట్ ఇచ్చిన దర్శకుడిని ఒకలా, ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను మరోలా చూడనని అందరిని సమానంగా చూస్తానని తెలిపాడు.
కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో వకీల్ సాబ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.కాగా ఈ చిత్రం ఈనెల 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కాబోతుంది.
కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న “హరహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ లభించింది.
కాగా దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.