సౌత్ ఇండియా లోనే కాకుండా మొత్తం దేశం లోనే టాప్ డైరెక్ట్ గా శంకర్ కు మంచి పేరుంది.టాప్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న దర్శకుడు శంకర్ తో దాదాపు 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయాలనుకున్నాడు.
అప్పట్లో ప్రముఖ దర్శకుడు శంకర్ తో చిరంజీవి హీరోగా సినిమాను నిర్మించాలని ఒక నిర్మాత భావించాడు.అందుకోసం చర్చలు జరిగాయి.
చిరంజీవి కూడా ఆసక్తిని వ్యక్తం చేశాడు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు.
దాంతో మళ్లీ ఎప్పుడు కూడా ఇద్దరి కాంబో మూవీ గురించిన చర్చ జరగలేదు.దర్శకుడు శంకర్ రెండు మూడు సార్లు హైదరాబాద్ వచ్చిన సమయంలో చిరంజీవితో సినిమా చేయాల్సి ఉండే కాని మిస్ అయ్యిందని అన్నాడు.
చిరంజీవితో సినిమాను మిస్ చేసిన దర్శకుడు శంకర్ తదుపరి సినిమాను మెగా తనయుడు చరణ్ తో చేయబోతున్నాడు.అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి తో ఆమద్య సినిమా అంటూ వార్తలు వచ్చినా కూడా నిజం కాదన్నారు.అలాగే చరణ్ తో శంకర్ కాంబో మూవీ అంటూ వార్తలు వచ్చాయి.
కాని అది కూడా నిజం కాకపోవచ్చు అన్నారు.కాని దర్శకుడు శంకర్ మరియు చరణ్ ల కాంబో మూవీని తాము నిర్మించబోతున్నట్లుగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు.
దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా వారికి 50వ సినిమా.తమ బ్యానర్ కు 50వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా దిల్ రాజు ఈ సినిమా కోసం 150 నుండి 200 కోట్ల వరకు పెట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తో బిజీగా ఉన్న చరణ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.2022 లేదా 23 లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.