యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో తారక్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్గా లాంఛ్ కూడా చేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.
కాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకుంటారనే టాక్ గతకొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
దబాంగ్ 3 చిత్రంలో మున్నీ రీమిక్స్ పాటలో చిందులేసిన అందాల భామ వరీనా హుస్సేన్ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే వరీనా తాజాగా హైదరాబాద్కు చేరిందని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆడిషన్స్ కోసమే ఆమెకు హైదరాబాద్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మరి ఆమె ఈ సినిమాలో నిజంగానే సెలెక్ట్ అవుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని, సినిమా కథ పొలిటికల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరి తారక్ 30వ చిత్రంలో హీరోయిన్గా ఎవరు ఫిక్స్ అవుతారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.