ఇప్పటి సమాజంలో ఉన్న మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతుంది.పసిపిల్లలు అని చూడకుండా చెత్త బుట్ట లో పడేయడం, ఎక్కడపడితే అక్కడ పాప ను విడిచి వెళ్ళడం, ఇంకా చెప్పాలి అంటే మానవత్వం మంట కలిసి పోయేలా అప్పుడే పుట్టిన చిన్న బిడ్డను కూడా కవర్లు అంటగట్టి ఊపిరాడకుండా చేసి బయట పడేస్తున్నారు.
మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం మంటగలిసి పోతుంది అనడంలో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
మనుషుల్లో ప్రేమాభిమానాలు చచ్చిపోయాయి.
నవమాసాలు మోసి కనిపెంచిన ఆ తల్లి యొక్క మాధుర్యాన్ని క్షణాల్లో మర్చిపోతున్నారు.చిన్న పిల్లల పట్ల ప్రేమ కనుమరుగైపోతుంది.
అయితే కుటుంబ పోషణ భారం అయ్యింది అని, ఆడపిల్ల పుట్టింది అని తమ పిల్లలను అమ్మకానికి పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.ఇలాంటి ఘటన ఈజిప్ట్ లో జరిగింది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విషయంలోకి వెళితే ఈజిప్టులోని కైరో కు చెందిన ఒక జంట తమ బిడ్డను అమ్మకానికి పెట్టారు.ఆ పాప ఫోటోలు షేర్ చేసిన దంపతులు తమ బిడ్డను అమ్మే యాలి అనుకుంటున్నాము అని ఆసక్తి గల వారు ఎవరైనా ఉంటే సంప్రదించగలరు అని పోస్ట్ చేశారు.
ఈ విషయం కాస్త బయటపడడంతో ఆ న్యూస్ వైరల్ అయింది.
అది కైరో సైబర్ క్రైమ్ కంట పడటం కూడా జరిగిపోయింది.ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సైబర్ క్రైమ్ వారు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ విషయంపై వారిని ఆరా తీయగా ఆర్థిక కష్టాల వల్లనే తాము తన బిడ్డను అమ్మకానికి పెట్టాము అని అధికారుల ముందు ఒప్పుకున్నారు.