సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఐ.భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలని క్రియేట్ చేసింది.
అయితే రిలీజ్ తర్వాత సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది.రొటీన్ రివెంజ్ కథకి శంకర్ తన స్టైల్ లో హెవీ కలరింగ్ ఇచ్చి ప్రేక్షకుల మీదకి వదిలాడని తేల్చేశారు.
అతని సినిమాలలో బేసిక్ గా ఉండే సోషల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో లేకపోవడంతో డిజాస్టర్ అయ్యింది.అయినా కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి.
ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా బ్రిటిష్ బ్యూటీ అమీజాక్సన్ నటించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు ప్రీమియర్ కి రెడీ అయ్యింది.
అప్పట్లో కొన్ని కారణాల వలన సినిమా టెలివిజన్ రిలీజ్ ఆగిపోయింది.
అయితే ఈ సినిమాని స్టార్ మా ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసుకుంది.
దీంతో ఎట్టకేలకు స్టార్ మాలో ఈ సినిమా ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతుంది.ఇక ఈ సినిమాపై స్టార్ మా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది.
కరోనా ఎఫెక్ట్ కారణంగా అందరూ ఇంటి దగ్గరే ఉండటంతో ఈ సినిమాని వీక్షించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, మంచి రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.మరి థియేటర్ లో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఐదేళ్ల తర్వాత టెలివిజన్ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.