రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది.ఎరువుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఉన్న అగ్రసేన్ ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఈడీ బృందం.ఇక మాజీ ఎంపీ బద్రిరామ్ జఖర్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఎగుమతుల్లో నిబంధనలకు ఉల్లంఘించినందుకు కస్టమ్స్ విభాగం రూ.7 కోట్ల జరిమానా విధించిన అనుపమ్ కృషి అనే సంస్థ యజమాని అగ్రసేన్ గెహ్లాట్. 2012-13 మధ్య అనుపమ్ కృషి ఎరువుల కంపెనీ కుంభకోణానికి పాల్పడినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు.యూపీఏ హయాంలో మ్యురియేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) ను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని గతంలో బీజేపీ ఆరోపించింది.
ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే దాన్ని ఎగుమతి చేసుకుని, సబ్సిడీ ధరలకు రైతులకు అందించాల్సి ఉంది.అయితే పొటాష్ కంపెనీకి ఆథరైజ్జ్ డీలరైన అనుపమ్ కృషి కంపెనీ రైతులకు అందించకుండా విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణ ఉంది.
అయితే రైతులకు అందిస్తామని ఎంవోపీ కొనుగోలు చేసిన కొందరు మధ్యవర్తులు విదేశాలకు ఎరువులను విక్రయించారని అగ్రసేన్ గహ్లెూత్ చెబుతున్నారు.అయితే ఇటీవలే సీఎం కుమారుడు వైభవ్ గహ్లెూ త్ వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతం రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.