దేశరాజధాని ఢిల్లీ పార్లమెంట్ ఆవరణ లో బుల్లెట్ల కలకలం రేగింది.పార్లమెంట్ ఆవరణలోకి బుల్లెట్ల తో ఒక వ్యక్తి ప్రవేశించడం తో స్థానికంగా సంచలనం సృష్టించింది.
దీనితో అధికారులు,భద్రతా సిబ్బంది ఒక్కసారిగా తేరుకొని అప్రమత్తమయ్యారు.ఒక వ్యక్తి బుల్లెట్ల తో పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించడం తో ఈ గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తుంది.
అక్తర్ ఖాన్ అనే వ్యక్తి బుల్లెట్ల తో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడం తో వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది.దీనితో అక్తర్ ను పోలీసులు విచారించగా అసలు విషయం వెల్లడైంది.
అక్తర్ ఖాన్ కు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందని,అయితే పొరపాటున బుల్లెట్లు తీయకుండానే పార్లమెంట్ ఆవరణ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.అయితే పోలీసులు విచారణ పూర్తైన తరువాత ఎలాంటి పొరపాటు లేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు అక్తర్ ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల రాజధాని ఢిల్లీ లో సీఏఏ కు వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకోవడం తో తీవ్ర హింస నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 43 మంది వరకు ప్రాణాలు కోల్పోగా,వందల మంది గాయపడిన విషయం తెలిసిందే.ఈ అల్లర్ల లో భాగంగా కాల్పుల ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.ఈ నేపథ్యంలో అక్తర్ వద్ద బుల్లెట్లు కనపడడం తో అధికారులు అప్రమత్తమై అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది.