మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘క్రాక్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ఆ అంచనాలను పెంచాయి.
తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు అర్ధమవుతోంది.
ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.కాగా ఓంగోల్లో జరిగే హత్యలు, మైనింగ్ మాఫియాకు సంబంధించిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది.
ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మనముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా టీజర్ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మే 8న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.