యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న వివి వినాయక్ కెరీర్లో అద్బుతమైన విజయాలు ఉన్నాయి.దర్శకుడిగా ఎంతో మందిని స్టార్స్ చేసిన వినాయక్ ప్రస్తుతం తాను ఒక స్టార్ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.
దిల్రాజు నిర్మాణంలో నరసింహ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న శీనయ్య అనే చిత్రంతో హీరోగా వినాయక్ పరిచయం కాబోతున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాల్లో ప్రముఖంగా వస్తున్నాయి.
శీనయ్య చిత్రం ఆగిపోయిందని కొందరు అంటున్నారు.ఇప్పటికే రెండు సార్లు రీ షూట్ చేసినా కూడా దిల్రాజు ఆశించిన స్థాయిలో ఔట్ పుట్ రాలేదట.మూడు నెలల క్రితం సినిమా పూర్తి అయ్యిందనుకుంటున్న సమయంలో దిల్రాజు రీ షూట్కు ఆదేశించాడు.ఈ రెండు నెలల పాటు రీ షూట్ చేసిన తర్వాత మళ్లీ దిల్రాజు నిరాశను వ్యక్తం చేశాడట.
దాంతో చేసేది లేక ప్రస్తుతానికి సినిమాను పక్కకు పెట్టారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వినాయక్ దర్శకుడిగా ఖైదీ నెం.150 చిత్రంతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు.ఆ తర్వాత చేసిన చిత్రం నిరాశ పర్చినా కూడా ఈయన దర్శకత్వంలో నటించేందుకు చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు.
కాని ఈయన మాత్రం హీరో అవ్వాలనే ఆశతో ఇటు వైపుకు వచ్చాడు.ఇలాంటి సమయంలో శీనయ్య చిత్రం పదే పదే వాయిదాలు పడటంతో చిత్ర యూనిట్ సభ్యులు నిరాశలో ఉన్నారు.
శీనయ్య అటు దర్శకత్వం చేసుకోక, ఇటు సినిమా పూర్తి కాక రెంటికి చెడ్డ రేవడి తరహాలో తయారు అయ్యాడు.