వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు సీఆర్డీఏ ను రద్దు చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.దాంతో ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు అమరావతి రాజధాని మార్పుతో పాటు సీఆర్డీఏ రద్దుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణ పూర్తి అయ్యే వరకు ఆ విషయాలపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వంకు హైకోర్టు సుచించింది.
దాంతో మూడు రాజధానుల విషయమై ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి.
ఇప్పటికే మండలిలో ఈ బిల్లు ఆగిపోయింది.
ఇదే సమయంలో హై కోర్టు కూడా ఇలా బ్రేక్ వేయడంతో జగన్ ప్రభుత్వం పెద్ద సంకటంలో పడ్డట్లయ్యింది.మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
కొందరు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు.