ఇప్పటికే ఎన్నికల హామీలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మరిన్ని హామీల వర్షం కురిపించింది.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నాడు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు.
ఆ మేనిఫెస్టోలో 24 అంశాలను చేర్చారు.అందులో వృద్దాప్య వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు.అలాగే ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు … రిటైర్మెంట్ వయస్సును మూడేళ్ల పాటు పెంచుతామని టీఆర్ఎస్ ప్రకటించింది.అలాగే… పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా… ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచుతూ టీఆర్ఎస్ ప్రకటించింది.ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని…ప్రభుత్వ ఉద్యోగల వేతన సవరణ చేస్తామని ప్రకటించారు.ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61కు పెంచుతామని ప్రకటించింది.పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.రెడ్డి, వైశ్య కార్పోరేషన్లకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం రూ.6 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి ఏటా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.ఏటా ప్రతి రైతుకు లక్ష రూపాయాల పంట రుణాన్ని మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది.
ఇలా అనేక హామీలతో తెలంగాణ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.