ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ మేమంతా సిద్ధం( Memanta Siddam )’ బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది.ఈ మేరకు నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది.
నారాయణపురం నుంచి నిడమర్ర, గణపవరం మీదుగా సీఎం జగన్ ఉండి చేరుకోనున్నారు.మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఉండి నుంచి బయలుదేరనున్న బస్సు యాత్ర భీమవరం బైపాస్ రోడ్డుకు చేరుకోనుంది.
అక్కడ సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొననున్నారు.తరువాత భీమవరం( Bhimavaram )లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సభ అనంతరం పిప్పర, రాలిపాడు, చిలకంపాడు లాకులు, దువ్వ, తణుకు క్రాస్, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకోనున్నారు.కాగా సీఎం జగన్ ఇవాళ రాత్రి ఈతకోట శివారులో బస చేయనున్నారు.