తెలుగులో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “యజ్ఞం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కోల్కతా బ్యూటీ “సమీరా బెనర్జీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే అప్పట్లో “యజ్ఞం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
అంతేకాక అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న గోపీచంద్ సినీ కెరియర్లో చెరిగిపోని మైలు రాయిగా నిలిచి పోయింది. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన “సమీరా బెనర్జీ” కి మాత్రం ఈ చిత్రంలో నటించిన తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు తలుపు తట్టలేదు.
అయినప్పటికీ సమీరా బెనర్జీ దాదాపుగా 4,5 సంవత్సరాలు అవకాశాల కోసం సినిమా పరిశ్రమలో బాగానే ఎదురు చూసింది.కానీ ఈ అమ్మడికి మాత్రం ఎలాంటి అవకాశాలు వరించ లేదు.
దీంతో ఇక చేసేదేమీలేక మూటాముల్లె సర్దుకుని తన స్వస్థలం అయిన కోల్కతా కి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో లో పలు సీరియళ్ళకి నిర్మాతగా వ్యవహరించిన “నీరజ్ శర్మ” అనే సీరియల్ నిర్మాతని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.అయితే ఇటీవలే సమీరా బెనర్జీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె అనుకున్న పాత్రలో నటించే అవకాశాలు రాకపోవడంతో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.
దీంతో ప్రస్తుతం పలు బెంగాలీ ధారావాహికలలో అత్త, అమ్మ, వదిన, తదితర పాత్రలలో నటిస్తోంది.ఏదేమైనప్పటికీ తెలుగులో గోపీచంద్ వంటి స్టార్ హీరో సరసన నటించి హిట్ కొట్టినప్పటికీ సమీరా బెనర్జీ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.