కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.మరి కాసేపటిలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాస సమావేశం జరగనుంది.
మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
ఇప్పటికే క్యాంప్ కు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా సమావేశ మందిరానికి రానున్నారు.కాగా ఒక క్యాంపులో 21 మంది ఉండగా మరో క్యాంపులో తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు.అయితే అవిశ్వాసం ప్రవేశపెట్టిన మెజార్టీ సభ్యులు అంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.