ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా( Social media ) వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏమి జరిగినా కానీ.
అందరికీ క్షణాలలో సోషల్ మీడియా ద్వారా ఈజీగా తెలిసిపోతుంది.నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
సాధారణంగా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు పెంపుడు జంతువులు కొంతమందిని వాటితో పాటు తీసుకొని వెళ్లడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే కొంతమంది ప్రయాణికులకు మాత్త్రం ఒక అనుకోని అతిధి ఆర్టీసీ బస్సు పై ప్రయాణించడం జరిగింది.
ముంబై నగరంలో ఒక ప్రముఖ బస్టాండులో గుంపులుగా ఉన్న కాకులు బస్సు పై ప్రయాణించడం జరిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai )లో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) లో కొన్ని కాకులు వచ్చి ఓ బస్సు పై వాలిపోయాయి.సడన్ గా ఒక్క సారిగా బస్సు స్టార్ట్ అవ్వగా ఆ కాకులు ఏమాత్రం కదలకుండా అలానే ప్రయాణం కొనసాగించాయి.ఇక ఈ వీడియో క్లిప్ ను ఓ నెటిజన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.
అవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటూ క్యాప్షన్ ను జత చేసాడు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ.కాకుల గుంపు ముంబై టూర్ కి వెళ్తున్నాయా అంటూ కామెంట్స్ చేశారు.ఇక మరికొందరు అయితే.
ముంబైలో కాకులు కూడా ప్రజా రవాణాలను వినియోగిస్తున్నాయా అని కామెంట్ చేశారు.ఇంకొక వ్యక్తి.
ఈ కాకులు చాలా స్మార్ట్ గురు అంటూ కామెంట్ చేసాడు.