తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ( Krishnavanshi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే.కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకులలో కృష్ణవంశీ కూడా ఒకరు.
ఈయన తరచూ తన సినిమాలకు సంబంధించిన విషయాలపై స్పందించడంతో పాటు, అభిమానులు పెట్టే పోస్టులపై కూడా స్పందిస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే ఆయన దర్శకత్వం వహించిన మురారి సినిమా( Murari movie ) సందర్భంగా తాజాగా ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు.ఈ సందర్భంగా అభిమానులు నెటిజెన్స్ అడిగే పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.మురారి సినిమా రీ రిలీజ్ లో నడివి తగ్గించండి అని అడగగా 18 నిమిషాల పాటు ట్రిమ్ చేసాము.
ఈ సినిమాలో సోనాలి బింద్రే నటన అద్భుతం అని తెలిపారు. సోనాలి బింద్రేను ( Sonali Bindre )ఎవరు ఎంపిక చేశారు అని అడగగా నిర్మాత రామలింగేశ్వర రావు ఎంపిక చేశారని తెలిపారు.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించగా.సీక్వెల్ అసాధ్యం అలాంటి కొనసాగింపు కథలు నాకు ఇష్టం ఉండవు అని తెలిపారు.
నిన్నే పెళ్ళాడతా సినిమాను రిలీజ్ చేయండి అని అడగగా.ఆ నిర్ణయం నాగర్జున తీసుకోవాలి అని తెలిపారు.మురారి ఖడ్గం లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఆశించవచ్చా అని ప్రశ్నించగా.మురారి విషయం తెలియదు కానీ ఖడ్గం లాంటి సినిమా అయితే రానుంది అని తెలిపారు.
మహేష్ బాబు తో మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారు అని ప్రశ్నించగా.కష్టమండి.ఎందుకంటే మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కదా అని తెలిపారు.