తిరుమలలో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.క్యూలైన్ లో గంటల పాటు వేచి ఉండాల్సి రావడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పొటెత్తారు.దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు రెండు కిలో మీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఇక స్వామి వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
మరోవైపు రద్దీ నేపథ్యంలో టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
కాలి నడకన వచ్చిన వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయలేదని, కనీసం భోజన సదుపాయాలు కూడా సరిగా లేవని వాపోతున్నారు.పాత పద్ధతిలోనే స్వామివారి దర్శనానికి అనుమతించాలని కోరుతున్నారు.