హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కస్టడీకి తీసుకునే సమయంలో జ్యోతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో వెంటనే జ్యోతిని ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అయితే ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రూ.84 వేల లంచం తీసుకుంటూ జ్యోతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే.అనంతరం ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కాగా వీటిలో రూ.65 లక్షల నగదుతో పాటు నాలుగు కేజీల బంగారం ఉన్నాయని తెలుస్తోంది.