ఇప్పటికే వరకు గోదావరి .ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపొయింది అని జనసేన పార్టీ మీద ఒకరకమైన ప్రచారం జరుగుతుండడంతో… జనసేన ఆ అపవాదు చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే… రాయలసీమలో ఆ పార్టీ తన కార్యకలాపాలను మొదలుపెట్టి ఆ తరువాత అన్ని ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది.దీనిలో బాగమేగానీ… జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో ఆదివారం కరువు రైతు కవాతు చేపట్టబోతున్నారు.
ఈ కవాతు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు స్థానిక మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ వరకూ నిర్వహించనున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.