కడపలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.అల్లరి చేస్తున్నాడని పదేళ్ల బాలుడిని బలితీసుకున్నారు మేనత్త, మేనమామ.
ఈ ఘటన నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ, భాగ్యమ్మలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తూ.వారి కుమారుడిని చెల్లెలు, బావకు అప్పగించారు.
ఈ క్రమంలో అల్లరి చేస్తున్నాడని మేనత్త, మేనమామలు వారం రోజులుగా తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని స్థానికులు చెబుతున్నారు.తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా అయాన్ మరణించాడని తెలిపారు.
బాలుడి మృతిచెందాడన్న వార్త తెలుసుకున్న అత్తమామలు పరార్ అయినట్లు గుర్తించారు.