అల్ల‌రి చేస్తున్నాడ‌ని బాలుడిని కొట్టి చంపిన అత్త‌మామ‌లు

క‌డ‌ప‌లో దారుణ ఘట‌న వెలుగులోకి వ‌చ్చింది.అల్ల‌రి చేస్తున్నాడ‌ని ప‌దేళ్ల‌ బాలుడిని బ‌లితీసుకున్నారు మేన‌త్త‌, మేన‌మామ‌.

ఈ ఘ‌ట‌న నంద‌లూరు మండ‌లం కోనంపేట‌కు చెందిన శివ‌, భాగ్య‌మ్మ‌లు ఉపాధి నిమిత్తం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తూ.

వారి కుమారుడిని చెల్లెలు, బావ‌కు అప్ప‌గించారు.ఈ క్ర‌మంలో అల్ల‌రి చేస్తున్నాడ‌ని మేన‌త్త‌, మేన‌మామ‌లు వారం రోజులుగా తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని స్థానికులు చెబుతున్నారు.

తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా అయాన్ మ‌ర‌ణించాడ‌ని తెలిపారు.బాలుడి మృతిచెందాడ‌న్న వార్త తెలుసుకున్న అత్త‌మామ‌లు పరార్ అయిన‌ట్లు గుర్తించారు.

పొడి జుట్టు ఒక్క దెబ్బతో స్మూత్ అండ్ సిల్కీగా మారాలా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!