పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న భారీగా విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యింది.ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు.
దాదాపుగా రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ వేడుక నిర్వహించబోతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో ఈవెంట్ మేనేజర్ చెప్పడంతో అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయాయి.హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో ఈ ప్రీ రిలీజ్ వేడుక కు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యాయి.
కొన్ని రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు ఈ వేడుక కోసం అనుమతులు ఇవ్వడం జరిగింది.కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఈవెంట్ ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అందుకే పోలీసులు అనుమతులకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఒక నోటీసును విడుదల చేసి మరీ వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు అనుమతులు ఇవ్వడం లేదు అంటూ ప్రకటించారు.
కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా అందులో పేర్కొన్నారు.సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులతో పాటు వేలల్లో అభిమానులు ఒక్క చోట చేరే అవకాశం ఉంటుంది.
తద్వారా కరోనా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అంత మంది లో సామాజిక దూరం పాటించడం అసాధ్యం అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తారనే నమ్మకం లేదు.
అందుకే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులు ఇవ్వాలనుకోవడం లేదు అంటూ పోలీసులు పేర్కొన్నారు.పవన్ అభిమానులు నిన్న ట్రైలర్ రిలీజ్ సందర్బంగా చేసిన హంగామా తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రచ్చ చేయడం ఖాయం అని అంతా అనుకున్నారు.
కాని పోలీసుల నిర్ణయంతో వారంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.