ఒకప్పుడు టీడీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఎంపీ సుజనా చౌదరి ఆ మధ్య భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీడీపీ పై పలు ఆరోపణలు కూడా చేసిన ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.ఇప్పటికే ఏపీ లో కూడా టీడీపీ ఇక తట్టా బుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకున్న ఈ తరుణంలో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.20 మంది టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆయన ప్రకటించడం తో ఆ పార్టీ గుండె గుభేల్ అంటుంది.ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు బీజేపీ లో చేరి టీడీపీ అధినేత చంద్రబాబు కు గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో 20 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నట్లు సుజనా ప్రకటించడం తో ఇప్పుడు ఏపీ లో టీడీపీ పరిస్థితి ఏమవ్వబోతుంది అన్నది ప్రస్నార్ధకంగా మారింది.
అంతేకాకుండా టీడీపీ నేతలే కాకుండా వైసీపీ కి చెందిన వారు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు సుజనా వ్యాఖ్యలు చేశారు.అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీల వాళ్లు తమతో కలవాలని, ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేయాలని కోరుతున్నారని సుజనా చౌదరి అన్నారు.
అయితే, ఇతర పార్టీల నుంచి వచ్చే ఏ నేతలైనా ఇప్పుడు బీజేపీలో చేరడానికి సమయం కాదని.అవసరమైనప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారమే రేపుతోంది.అయితే, రాజకీయ వ్యూహంతోనే సుజనాచౌదరి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు టచ్లో ఉన్నారా? అనే అంశం పై ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చే కొనసాగుతుంది.