టాలీవుడ్ మరియు కోలీవుడ్ హీరోయిన్స్ ఈమద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికాలు దక్కించుకుంటున్నారు.రికార్డు స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటున్న సినిమాల్లో నటిస్తున్నందుకు గాను హీరోయిన్స్ కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు.
నయనతార హీరోయిన్ గా నటించేందుకు రెండున్నర నుండి నాలుగు కోట్ల వరకు తీసుకుంటుందట.తెలుగు లో ఈమె నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం ఏమీ లేవు.
త్వరలో లూసీఫర్ లో నటించబోతుంది.ఆ సినిమాకు గాను ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను తీసుకోబోతుంది.
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు నాలుగు కోట్లు లాభాల్లో వాటాను తీసుకుంటుందట.పారితోషికం విషయంలో సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయన్ ను క్రాస్ చేసే వారు ఎవరు లేరు.
ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్నా ఉంది.
ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక మందన్నా ఏకంగా 20 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.
ఆ తర్వాత స్థానంలో 19 మిలియన్స్ పాలోవర్స్ తో కాజల్ నిలిచింది.సమంత కూడా రష్మిక తర్వాతే ఉంది.ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అయిన పూజా హెగ్డే కూడా చాలా వెనుక బడి ఉంది.కనుక సౌత్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే రష్మిక అనవచ్చు.
ఇక సౌత్ లో నెం.1 గా రష్మిక నిలిచింది అనడంలో సందేహం లేదు.అద్బుతమైన నటన మరియు అందంతో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా త్వరలో పుష్ప రాజ్ భార్యగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అది మాత్రమే కాకుండా పలు తెలుగు సినిమాలు రెండు హిందీ సినిమాలు రెండు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా ఇలా ఇన్ని సినిమాలు చేస్తున్న కారణంగా రష్మిక ఖచ్చితంగా నెం.1 అనడంలో సందేహం లేదు.