కేటీఆర్ ప్రసంగంలో కనిపించని కొత్తదనం...!

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీకి( Congress party ) ఓటేస్తే 50 ఏళ్ల వెనక్కి పోతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు.బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్( MLA Bollam Mallaiah Yadav ) తరుపున రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం ఒకటై కోదాడలో బొల్లం మల్లన్నను,రాష్ట్రంలో కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకుందామన్నారు.24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పాలన కావాలా? అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపిస్తే కోదాడలో హైటెక్ బస్టాండ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలు,స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని,కోదాడ పట్టణాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.గతంలో ఇచ్చిన హామీ 100 పడకల ఆసుపత్రి మంజూరైందని ఎన్నికల తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు.కేటీఆర్ ఎక్కడా దళిత బంధు,బీసీ బంధు,డబుల్ బెడ్ రూం,గృహలక్ష్మి పథకాల ప్రస్తావన ఎత్తకపోవడం గమనార్హం.

 Something New In Ktr's Speech , Ktr, Congress Party, Kcr, Mla Bollam Mallaiah Y-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube