స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హాసన్.కమల్ హసన్ కూతురు అనే ట్యాగ్ తో నటిగా తెరంగేట్రం చేసిన ఈ భామ అతి కొద్ది కాలంలోనే తన మల్టీ టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
నటిగా, గాయనిగా, మ్యూజిషియన్ గా విభిన్న రంగాలలో సత్తా చాటుతుంది.తనలోనే టాలెంట్ కి పదును పెడుతూ దానిని అందరికి పరిచయం చేస్తూ శృతి హాసన్ అంటే ప్రత్యేకం అనే గుర్తింపుని తెచ్చుకుంది.
అయితే ఆ మధ్య ప్రియుడుతో కలిసి ఫారిన్ లో కొంత కాలం ఉండి అక్కడే మ్యూజికల్ షోలు చేస్తూ సినిమాలు పక్కన పెట్టింది.మరల బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయిన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో క్రాక్ సినిమాతో పాటు వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది.ఈ రెండు కూడా షూటింగ్ చివరి దశకి వచ్చేసాయి. ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ తాజాగా తెలుగు మీడియా తనపై ప్రచారం చేసిన కథనాలపై అసహనం వ్యక్తం చేసింది.ఇటీవల తాను ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి తప్పుగా మాట్లాడినట్లు వక్రీకరించి వార్తలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు సినిమాల గురించి తాను ఎలాంటి తప్పుడు వాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని శ్రుతి హాసన్ ఉద్ఘాటించారు.
రేసుగుర్రం, పవన్ కల్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నానని వివరించారు.అలాంటి తెలుగు సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని శ్రుతి వెల్లడించారు.