చిరంజీవికి జోడీగా కనిపించబోతున్న శ్రియ శరన్...నెక్స్ట్ మూవీలో

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టారు.ఆచార్య కంప్లీట్ చేసిన తర్వాత ఏకంగా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

 Shriya Saran Romance With Chiranjeevi Once Again, Vedhalam Remake, Lucifer Remak-TeluguStop.com

అందులో రెండు రీమేక్ మూవీలే కావడం విశేషం.రీమేక్ అయితే హిట్ పక్కా అని భావించి సేఫ్ జోన్ లో వీటిని చిరంజీవి కొనెదల ప్రొడక్షన్ బ్యానర్ లో సెట్ చేసారు.

సైరా నరసింహారెడ్డితో వచ్చిన కొంత నష్టాన్ని ఈ సినిమాలతో పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ మూవీలో హీరోయిన్ పాత్రకి స్కోప్ లేదు.ఇక స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది.

ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం మూవీ రీమేక్ కూడా కథ సిద్ధం అయ్యింది.ఇందులో ఒరిజినల్ వెర్షన్ లో నయనతార నటించింది.

ఇప్పుడు ఆ పాత్ర కోసం చిరంజీవికి జోడీగా సీనియర్ హాట్ బ్యూటీ శ్రియ శరన్ ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయిపోయిన ఈ బ్యూటీ అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగన్ కి జోడీగా నటిస్తుంది.అలాగే మరో పాన్ ఇండియా మూవీలో ఇద్దరి పిల్లల తల్లిగా బధిర మహిళ పాత్రలో శ్రియ నటిస్తుంది.

ఇప్పుడు మెగాస్టార్ వేదాళం మూవీ కోసం ఆమెని సంప్రదించినట్లు తెలుస్తుంది.ఆమె కూడా నటించడానికి ఒకే చెప్పిందని బోగట్టా.ఇదే కనుకనిజమైతే ఠాగూర్ తర్వాత చిరంజీవి, శ్రియ కలిసి నటించిన చిత్రం ఇదే అవుతుంది.మరి దీనిలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube