ఎన్టీఆర్ ఎస్వీఆర్ తెలుగు ఇండస్ట్రీలో ఈ పేర్లు తెలియని వాళ్లు ఉండరు.ఇద్దరూ పౌరాణిక పాత్రల్లో నటించి డైలాగ్ లను చెప్పారంటే ప్రేక్షకులకు కన్నుల పండుగే.
ఇద్దరి మధ్య పోటీ కూడా అంతే గట్టిగా ఉండేది.పాత్రల విషయంలోనూ చాలా ఛాలెంజింగ్ గా నిర్ణయం తీసుకునేవారు.
వారిద్దరి మధ్య ప్రొఫెషనల్ జెలసీ కూడా ఉండేది.కానీ ఇద్దరిలో ఎవరు గొప్ప నటుడు అని అడిగితే మాత్రం చెప్పడం చాలా కష్టం.
కానీ సీనియర్ నటుడు సత్యనారాయణ మాత్రం ఎస్వీఆర్, ఎన్టీఆర్ లో ఎవరు గొప్ప నటుడు అనే విషయాన్ని మాత్రం తేల్చి చెప్పారు.దానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు.
తన వారసుడిగా ఎందుకు ప్రకటించారో కూడా వెల్లడించారు.పర్సనాలిటీ పరంగా ఎన్టీఆర్ గొప్ప నటుడు.
అది లక్షల్లో ఒకరికి ఉంటుంది.ఇక క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే అది ఎస్వీఆర్.
ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే అలవోకగా చెప్పేవారు తామంతా చిన్నచిన్న డైలాగులు చెబుతుంటే ఆయన మాత్రం ఒకేసారి డైలాగ్ ను చెప్పి తమను నేలకు దించేవారు.ఒక సినిమాకు తాను ఎస్.వి.ఆర్ నటించాల్సి ఉండగా ఒక డైలాగ్ చెప్పే క్రమంలో ఏంటి ఆ డైలాగ్ చెప్పడం అని, ఆ డైలాగ్ ని ఎలా చెప్పాలో చేసి చూపించి మరి తనకు నేర్పించేవారని సత్యనారాయణ అన్నారు.అలా ప్రతి సారి చెప్పడం చూసి తనకు నిజంగా డైలాగ్ చెప్పడం రాదా అని ఆయన అనుకున్నారట.ఆయనతో ఎప్పటికైనా అనిపించుకోవాలని సత్యనారాయణ నిర్ణయించుకున్నారట.
ఆ తర్వాత తను ఒక షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఎస్.వి.ఆర్ తన ఎదురుగా వచ్చి తనకు ఒక విషయం చెప్పాలని అన్నారట.తనకంటే బాగా నటించానని కంగ్రాచ్యులేషన్స్ అంటూ పొగిడారని సత్యనారాయణ చెప్పారు.
ఆ సినిమానే దేవుడు చేసిన మనుషులు.అలా నటిస్తున్న క్రమంలోనే ఆయనతో పాటు పోటీగా నటిస్తూ తన టాలెంట్ ని నిరూపించుకుంటూ వచ్చారు సత్యనారాయణ.
అలా ఒక రోజు షూటింగ్ సమయంలో తన వారసుడిగా సత్యనారాయణ ను ప్రకటించారు.తనతో పోటీగా, తన కంటే మెరుగ్గా నటిస్తున్న సత్యనారాయణను వారసుడిగా ప్రకటిస్తున్నాను అంటూ అందరికీ చెప్పారట.పౌరాణిక చిత్రాలను కూడా ఫాలో అయితే కచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని సత్యనారాయణకు చెప్పారట.ఎన్టీఆర్, ఎస్వీఆర్ లలో నిజంగా చెప్పాలంటే గొప్ప నటుడు ఎస్వీఆరే అని సత్యనారాయణ తేల్చిచెప్పారు.