ఏప్రిల్ 17వ తారీఖున తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే బిజెపి పార్టీ తరఫున రత్నప్రభ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా పాల్గొంటున్నారు.ఏపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో పార్టీ నాయకులను ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 3 వ తారీకు పార్టీ అభ్యర్థి రత్నప్రభ విజయానికి మద్దతు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారట.
ఎమ్.ఆర్ పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం కోసం రెండు పార్టీలకు చెందిన నాయకులు పవన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారట.
పర్యటన ఖరారు కావడంతో పవన్ కళ్యాణ్ భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రెండు పార్టీలకు చెందిన నాయకులు.