సౌత్ ఇండియాలో బెస్ట్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నిత్యా మీనన్.మలయాళీ భామ అయిన కూడా తాను ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష నేర్చుకొని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం నిత్యా టాలెంట్.
ఇలా ప్రస్తుతం ఈ భామ సౌత్ భాషలన్నింటిని నేర్చేసుకుంది.ఇక తన పాత్రకి స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే నిత్యా మీనన్ చేస్తుంది.
ప్రాధాన్యత లేని పాత్రతో స్టార్ హీరో సినిమా అయిన ఈ భామ నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది.ఇక సౌందర్య తర్వాత సౌత్ లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిత్య మీనన్ కెరియర్ లో చేసిన సినిమాలు తక్కువే అయిన తనకంటూ అభిమానులని ప్రతి చోట ఏర్పరుచుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్, ఇతర నటీమణులపై లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఆ మధ్య చాలా ఎక్కువగా ట్రెండింగ్ అయిన మీటూ ఉద్యమం కాస్తా చల్లబడిన అప్పుడప్పుడు ఏదో ఒక ఇండస్ట్రీలో చిన్న, పెద్ద హీరోయిన్స్ అని తేడా లేకుండా అందరూ తమకి ఇండస్ట్రీలో ఎదురైనా లైంగిక వేధింపుల మీద పెదవి విప్పుతున్నారు.
తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్ లో మీటూ గురించి మాట్లాడిన నిత్యా మీనన్ తనకి జరిగిన అనుభవాన్ని పంచుకుంది.మీటూ ఉద్యమం చాలా మంచి ఉద్దేశ్యంతో నడుస్తుందని నిత్యా వ్యాఖ్యానించింది.
తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని, అయితే చెడుగా ప్రవర్తించిన వాళ్లను పిలిచి బయటకు పొమ్మని హెచ్చరించానని నిత్యా వెల్లడించారు.మీకు గౌరవం అవసరం లేదా? అది మిగలాలంటే చెడు ప్రవర్తన వద్దు అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.