సంక్రాంతి పండగ వచ్చేస్తోంది.ఏదైనా పండగ రాబోతోందంటే మగువలు అందంగా, కాంతి వంతంగా వెలిగిపోవాలని తెగ ఆరాట పడుతుంటారు.
ఈ క్రమంలోనే పండక్కి పది రోజుల ముందు నుంచే చర్మంపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.ఖరీదైన ఫేస్ క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మినపపిండితో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే సంక్రాంతి పండక్కి ముఖాన్ని అందంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు అసలు మ్యాటర్లోకి వెళ్లి పోదాం పదండీ.
మొదట ఒక కప్పు మినుములు తీసుకుని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత వేయించుకున్న మినుములను మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మినప పిండి, అర స్పూన్ చందనం పొడి, మూడు స్పూన్ల పెరుగు, అర స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని పావు గంట పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం కూల్ వాటర్లో ఫేష్ వాష్ చేసుకోవాలి.ఈ ప్యాక్ వల్ల చర్మంపై పేరుకు పోయిన మురికి, మృత కణాలు, అధిక జిడ్డు తొలగి పోతాయి.
ముఖం గ్లోగా, షైనీగా మారుతుంది.
అలాగే మినపపిండితో మరో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.అందు కోసం ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల మినపపిండి, ఒక స్పూన్ అరటి పండు పేస్ట్, నాలుగు స్పూన్ల పచ్చి పాలు, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆపై గోరు వెచ్చని నీటితో చర్మాన్ని శుభ్ర పరుచుకోవాలి.
మూడు రోజులకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తెల్లగా, కాంతి వంతంగా మారుతుంది.మరియు ముడతలు ఉంటే తగ్గి స్కిన్ స్మూత్గా, సాఫ్ట్గా తయారవుతుంది.