మోసం, మనీలాండరింగ్ కేసులో భారతదేశంలో వాంటెడ్ క్రిమినల్గా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని( Nirav Modi ) యూకేలోని రద్దీ జైలు నుంచి లండన్లోని ప్రైవేట్ జైలుకు తరలించారు.పరారీలో ఉన్న ఈ వజ్రాల వ్యాపారి యూకేలోని అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో ఒకటైన HMP వాండ్స్వర్త్ లో( HM Prison Wandsworth ) మొన్నటిదాకా ఉన్నాడు.
ఇప్పుడు అతడిని లండన్లోని ప్రైవేట్గా ఆపరేట్ చేస్తున్న HMP థేమ్సైడ్ జైలుకు( HM Prison Thameside ) బదిలీ చేశారు.అతని బదిలీకి కారణం అధికారికంగా చెప్పలేదు.
అయితే ఇటీవల ఒక ఉగ్రవాద అనుమానితుడు వాండ్స్వర్త్ జైల్ నుంచి తప్పించుకోవడంతో అక్కడి అధికారులు ఆందోళన పడ్డారు.మరింతమంది ఖైదీలు తప్పించుకునే ప్రమాదం ఉందని భయపడ్డారు.ఈ జైలులో చాలా ఎక్కువ మంది ఖైదీలు ఉండగా వారిని పరివేక్షించడం తలకు మించిన భారంగా మారింది.ఈ నేపథ్యంలోనే నీరవ్ కూడా తప్పించుకునే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అతడిని HMP థేమ్సైడ్ జైలుకు బదిలీ చేశారు.
న్యాయపరమైన ఖర్చులపై విచారణ నిమిత్తం నీరవ్ మోదీ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, అతడు ఎక్కడున్నాడో కోర్టుకు తెలియకపోవడంతో కేసు వాయిదా పడింది.అంటే అతడిని జైల్లో అధికారులు వెంటనే పట్టుకోలేకపోయారు.నీరవ్ మోదీని ఇప్పుడు లండన్లోని( London ) ఒక ప్రైవేట్ జైలులో ఉంచారు, అది కూడా రద్దీగా ఉంటుంది.అయితే, అతని కొత్త జైలు వద్ద భద్రతా స్థాయి మునుపటి జైలు మాదిరిగానే ఉంది.
52 ఏళ్ల నీరవ్ గత సంవత్సరం భారతదేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటంలో ఓడిపోయాడు, కానీ అతని కేసు ఇప్పుడు తదుపరి వ్యాజ్యం పెండింగ్లో ఉంది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ను( Punjab National Bank ) 2 బిలియన్ డాలర్ల మేర మోసగించినట్లు నీరవ్ మోదీపై ఆరోపణలు వచ్చాయి.అతను మార్చి 2019 లో అరెస్టు చేయబడ్డాడు, అప్పటి నుండి జైలులో ఉన్నాడు.