మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది టాలీవుడ్ కి వచ్చారు.
అందరూ మెచ్చేలా నటించారు.వావ్ అనిపించారు.
ఇక ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక ఇప్పటికే ఒక క్రికెట్ టీమ్ హీరోలుగా వచ్చి స్థిరపడగా మెగా ఫ్యామిలీ నుంచి ఒకే ఒక్కరు మాత్రం హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఆమె ఎవరో కాదు నిహారికనే.మెగా డాటర్ అయిన నిహారిక మొదట వెబ్ సిరీస్ లో నటించగా ఆతర్వాత బుల్లితెరపై ఆతర్వాత వెండితెరపై మెరిసింది.
బుల్లితెరపై ఢీ షోకి యాంకరింగ్ చేసిన నిహారిక కొణిదెల ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంది.అలాంటి ఈ నటి ”ఒక మనసు” అంటూ 2016లో వెండితెరపై అడుగుపెట్టగా సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.
ఆతర్వాత తీసిన సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.దీంతో ఎన్నో రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవల తను పెళ్లి చేసుకోనున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
ఆ తర్వాత నిశ్చితార్థం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.అయితే పెళ్ళికి చాలా డేస్ గ్యాప్ రావడంతో నిహారిక తన బ్యాచిలర్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక అలానే మొన్న ఈ మధ్య గోవాకు వెళ్లిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లతో తన బ్యాచిలర్ డేస్ ని ఎంజాయ్ చేస్తుంది.లావణ్య త్రిపాఠి, రీతూవర్మతో గోవా బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చెయ్యగా ఇప్పుడు నిహారికకు వీరు ఇద్దరు కలిసి స్పెషల్ నైట్ పార్టీ ఇచ్చారు.
ఈ నైట్ పార్టీ లో నిహారిక బాగా ఎంజాయ్ చేసింది.ఆ ఫోటోలను నిహారిక, లావణ్య, రీతూవర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా వారి ఫోటోలను అభిమానులతో షేర్ చేశారు.”నేను దీనిని పూర్తిగా ఊహించలేదు.చాలా బాగుంది.
లవ్ యూ లావణ్య, రీతూ, అనితారెడ్డి” అంటూ నిహారిక ఓ పోస్ట్ చెయ్యగా.లావణ్య పోస్ట్ చేస్తూ.
ఇది స్యాటర్డే నైట్ పార్టీ అంటూ పోస్ట్ చేసింది.ఇక రీతూ వర్మ ఏమో పెళ్లికూతురు అంటూ ఫోటోలు షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.