తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో సినీనటుడు భరత్ రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు మొరంశెట్టి రాములు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపల సినీనటుడు భరత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
స్వామి వారి ఆశీస్సులతో మిల్లెట్ మార్వెల్ అనే సంస్ధను స్ధాపించాంమని,ఈ సంస్ధను స్ధాపించి అభివృద్ధి చేసేందుకు నాలుగు సంవత్సరాలు పట్టిందన్నారు.
మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను తిరిగి భారతదేశం అంతటా విస్తరించడమే ఈ సంస్ధ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలియజేశారు.భావితరాలను ఆరోగ్యకరంగా చూడాలంటే చిరుధాన్యాలు ఆహారంను స్వీకరించడం ప్రతి ఒక్కరూ ప్రారంభీంచాలన్నారు.
ముందుగా శ్రీవారి ఆశీస్సులతో తిరుపతిలో ప్రారంభించిన తరువాత దేశ వ్యాప్తంగా స్టోర్స్ ను ప్రారంబిస్తాంమని ఆయన అన్నారు.