టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొందరు చిల్లర వ్యక్తులు ప్రోత్సహించడంతోనే విశాఖలో తమపై దాడి జరిగిందని ఆరోపించారు.
సినిమా వాళ్లను చూసి అనుకరిస్తే నిజ జీవితంలో నష్టపోవాల్సి వస్తుందని సూచించారు.చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబుకు తొత్తుని విమర్శించారు.ఎంతమంది ఏకమైనా జగన్ తో పోటీ పడలేరని మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు.